Sunday, April 28, 2024

Adoni – రైల్వే స్టేషన్ లో రూ.కోటి నగదు స్వాధీనం

కర్నూలు జిల్లా (ఆదోని) ఆదోని… ఆదోని రైల్వే స్టేషన్ లో ఎలాంటి ఆధారాలు రూపాయలు కోటి నగదును తీసుకెళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఆదివారం వెలుగు చూసింది. ఆదోని పట్టణం హవన్నపేటకు చెందిన ఖోల్కర్ మహ్మద్ అనే వ్యక్తి బేగంపేట్ నుంచి ఆదోని వెళ్లే రైలు నంబర్ 12794 రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా ఆదోని రైల్వే ఆర్ పి ఎస్ ఐ, కే గోపాల్ ఆర్ పి ఎస్ ఐరామస్వామి ఆర్ పి ఎఫ్ ఎస్ ఐలక్ష్మన్న తదితరులు విధుల్లో భాగంగా తనిఖీలు చేస్తుండగా పై రూ. కోటికి పైగా నగదును పోలీసులు అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల్లో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కు అప్పగించడం జరుగుతుందని వారు తెలిపారు.

.తనిఖీలలో సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సర్వేశ్వరరావు, శివరామయ్య మరియు కానిస్టేబుళ్ళు పరుశురాముడు, శైక్షవాలి, మహేంద్ర, ఆర్పిఎఫ్ మహిళా సిబ్బంది లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement