Tuesday, April 30, 2024

NTR Statue: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. దుర్గిలో టెన్షన్ వాతావరణం

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ ప్రధాన రహదారి పక్కనే ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్​న్​టీఆర్​ విగ్రహాన్ని ఓ వ్యక్తి సుత్తితో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో విగ్రహం స్వల్పంగా పగిలింది. దీనితో టీడీపీ కార్యకర్తలు స్థానికంగా ఆందోళనకు దిగారు.

స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విగ్రహ ధ్వంసానికి యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్​ యలమంద కుమారుడు కోటేశ్వర్​ రావుగా గుర్తించారు. దీనితో స్థానికంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు దుర్గిలో 144 సెక్షన్​ విధిచారు. కాగా, విగ్రహం ధ్వంసం చేసేందుకు యత్నించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement