Sunday, April 28, 2024

మంత్రి జ‌య‌రాంని క‌లిసిన నూత‌న సొసైటీ చైర్మ‌న్ లు

ఆలూరు ప్రభ న్యూస్ : నియోజకవర్గ పరిధిలో నూతన సొసైటీ చైర్మన్ లుగా ఆలూరు హరిజన హనుమంతమ్మ, చిప్పగిరి మండలం బెల్డోనా సొసైటీ చైర్మన్ గా మల్లికార్జునను నియమించడం జరిగింది. పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గుమ్మనూరు జయరాంని శాలువా, పూలమాలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతన సొసైటీ ఛైర్మన్ లు రైతుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలూరు సొసైటీ ఛైర్మన్ తనయుడు పెట్రోల్ బంక్ కిషోర్, వైస్ ఎంపీపీ భర్త శ్రీధర్, కురుకుంద సర్పంచ్ దేవిరెడ్డి, వార్డు సభ్యులు ప్రకాష్, జీరా గౌడ్, ఉప సర్పంచ్ మణికంఠ, నాయకులు నాగార్జున, పవన్, భరత్, స్వామి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement