Tuesday, April 30, 2024

Lord Shiva | శ్రీకాళహస్తిలో కొత్త రూల్​, రూ.500లతో అంతరాలయ దర్శనం.. ధర్మకర్తల మండలి తీర్మానం

శ్రీకాళహస్తి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునేందుకు దర్మకర్తల మండలి ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారిని అంతరాలయ దర్శనం చేసుకోడానికి రూ. 500 టికెట్ ను ప్రవేశ పెట్టాలని సోమవారం సాయంత్రం జరిగిన శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానించింది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ధర్మకర్తల మండలి సమావేశంలో 48 అంశాలకు సంబంధించిన అజెండాపై చర్చించి ఆమోదించారు. సమావేశం అనంతరం అంజూరు తారక శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సలహాలు, సూచనలతో ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సువర్ణముఖి నదిని పవిత్రంగా ఉంచడానికి పట్టణ పరిధిలో నదిలోని మురుగు నీటిని పైప్ లైన్ ద్వారా తరలించే పథకానికి ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రోటోకాల్ విఐపి లకు నిర్దిష్ట సమయంలో దర్శనం ఏర్పాటు చేసే అంశాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు తెలిపారు.

ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు అంతరాలయ దర్శనానికి 500 రూపాయలతో టికెట్ పెట్టనున్నట్లు వెల్లడించారు
స్థానిక భక్తులకు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అంతరాలయ దర్శనం త్వరలో అమలులోకి తీసుకొస్తామని చెప్పారు.. ప్రధాన ఆలయంలో లీకేజీ నివారణకు సంబంధించి మూడు కోట్లతో పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దాత సహకారంతో ఈ పనులు చేయనున్నట్లు తెలిపారు.. రామసేతు వంతెన కొత్త బ్రిడ్జి మధ్య ఖాళీ స్థలంలో దక్షిణామూర్తి విగ్రహాన్ని, సీడ్స్ సర్కిల్లో ధ్యానమూర్తి శివయ్య విగ్రహం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక వాతావరణం పట్టణంలో కనిపించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఆదికాలంలో ఉన్న గురు దక్షిణామూర్తి బ్రహ్మోత్సవాల పునర్ధరణ చేయడంపై చర్చించినట్లు తెలిపారు. ఇష్టానుసారం చేసే అంతర్గత బదిలీలతో పలు ఇబ్బందులు ఏర్పడుతున్నందున ఆలయంలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు ధర్మకర్తల మండలి అనుమతితో మాత్రమే చేయాలని తీర్మానించామన్నారు. ప్రముఖుల ఆశీర్వాదానికి ఇకపై ప్రత్యేకంగా ఆశీర్వాద మండపం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిప్రదక్షిణ మార్గంలో సోలార్ లైట్లు ఏర్పాటు, ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం తదితర అంశాలను ఆమోదం తెలిపినట్లు చెప్పారు. నిత్య అన్నదాన మండపం పైన మరో సెల్లార్ ఏర్పాటు చేసి ఒక విడతలో 1000 మందికి అన్నదానం చేసేలా చేస్తామన్నారు. అమ్మవారి నెప్పాల మండపం పునర్నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement