Friday, May 3, 2024

ఏపీలో ఆరు రకాలుగా నూతన విద్యావిధానం

ఏపీలో నూతన విద్యా విధానంపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. నూతన విద్యా విధానంలో స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించాలని ఖరారు చేశారు సీఎం జగన్. ఈ విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారని తెలిపారు అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. స్టూడెంట్, టీచర్ రేష్యో పై తయారు చేసిన ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు..

‌శాటిలైట్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2) 
ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2. 1, 2)
ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ)
ప్రీ హైస్కూల్స్‌ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)
హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకూ)
హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ) వర్గీకరించామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణ వల్ల సుమారుగా ఇప్పుడున్న స్కూల్స్‌  44వేల నుంచి సుమారు 58వేల స్కూల్స్‌ అవుతాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.

నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని.. ఈ విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారని తెలిపారు సీఎం జగన్. అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పడుతుందన్న సీఎం.. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని స్పస్టం చేశారు.. ఎన్ఈపీపై కలెక్టర్లు, జేసీలు, డీఈవోలు, పీడీలకు ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.. ప్రభుత్వ పాఠశాలల్లో 2018–19లో 70.43 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య అమ్మ ఒడి పథకం వల్ల 2020–21 నాటికి రూ.73.06 లక్షలకు చేరినట్టు అధికారులు సీఎంకు తెలిపారు.. ఇక, పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 16న విద్యాకానుక ప్రారంభించనున్నారు సీఎం జగన్.

ఇది కూడా చదవండి:ఆకట్టుకుంటున్న వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ టీజర్

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement