Friday, April 26, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న జడ్పిటిసి వైసిపి అభ్యర్థి నాగేంద్ర‌

వరికుంటపాడు :- వరికుంటపాడు మండలం వైసిపి జెడ్పిటిసి అభ్యర్థిగా రావెళ్ల నాగేంద్ర బరిలో ఉన్నారు గురువారం ఆయన స్వగ్రామమైన రామాపురం లో ఆయన సతీమణి స్వాతి తో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో బరిలోకి దిగడం జరిగింద‌న్నారు.. ఈ ఎన్నిక‌ల‌లో అత్యధిక మెజార్టీతో గెలుపొందుతాన‌నే ధీమాను వ్య‌క్తం చేశారు. అదేవిధంగా తిమ్మారెడ్డి పల్లె లో ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ ఆలీ అహ్మద్ వరికుంటపాడు లో బిజెపి జెడ్పిటిసి అభ్యర్థి ఆండ్రా పరంధామిరెడ్డి లు కూడా త‌మ త‌మ ఓటు హక్కును వినియోగించుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement