Thursday, March 28, 2024

ఓటు హక్కును వినియోగించుకున్న స్పీక‌ర్ త‌మ్మినేని..

శ్రీకాకుళం, : జిల్లాలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లావ్యాప్తంగా గురువారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తన స్వగ్రామమైన పోలాకి మండలం మబగాంలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా పొందూరు మండలం తొగారాంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం దంపతులు, వజ్రపు కొత్తూరు మండలం దేవునళ్తాడలో రాష్ట్ర పశు సంవర్ధక,మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు దంపతులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇచ్చాపురంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు పిరియా సాయిరాజ్, రణస్థలం మండలం పాతర్లపల్లిలో ఎచ్చెర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్, వీరఘట్టం మండలం వండవలో పాలకొండ శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి, రాజాం మండలం సారధిలో శాసనసభ్యులు కంబాల జోగులు, పాతపట్నంలో రెడ్డి శాంతి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement