Saturday, April 27, 2024

ప్రశాంతంగా జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్..

వరికుంటపాడు :- వరికుంటపాడు మండలం లోని తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు జెడ్పిటిసి స్థానానికి గురువారం ఎన్నికలు ప్రశాంతంగా కొన‌సాగుతున్నాయి.. రిటర్నింగ్ అధికారి పి రమేష్ 34 పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు ఎస్ ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఎన్నికలు సజావుగా జరిగేలా గట్టి భద్రత కల్పించారు ఎక్కడైనా చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి ఆదేశించారు. తొలుత వరికుంటపాడు లో బిజెపి జెడ్పిటిసి అభ్యర్థి పరంధామి రెడ్డి ఓటు హక్కును వినియోగించుకునేందుకు బూతు లోకి వెళ్లగా అధికారులు ఓటు వేసేందుకు నిరాకరించారు ఏదైనా గుర్తింపు కార్డు లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు లేద‌న్నారు. కొంతసేపు వివాదం జరగగా ఏజెంట్ల చొరవతో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి పల్లి ఎంపీటీసీ పరిధిలో పామూరు పల్లి లో స్వల్ప వివాదం చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement