Sunday, April 28, 2024

మంత్రి ప‌ద‌వి చేపట్టి ఏడాది పూర్తి.. కాకాణిని అభినందించిన వైకాపా నేత‌లు..

ముత్తుకూరు ఏప్రిల్ 11( ప్రభ న్యూస్) : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి సంవత్సరం పూర్త‌యింది. ఈ సందర్భంగా మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రిని క్యాంప్ కార్యాలయం నందు కలిసి అభినందనలు తెలిపినారు. పార్టీ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి, దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి మరి కొంతమంది కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు. మండల పార్టీ నాయకుల అభిమానం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement