Sunday, April 28, 2024

ముత్తుకూరులో వైకాపా కన్వీనర్ మెట్టా జన్మదిన వేడుకలు

ముత్తుకూరు, ఏప్రిల్ 11 (ప్రభ న్యూస్) : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ముత్తుకూరు మండల కేంద్రం నందు మంగళవారం ఘనంగా జరిగినాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహం వద్ద పార్టీ నాయకత్వం ఈ జన్మదిన వేడుకలు జరిపింది. ఈ నేపథ్యంలో మండల ఎంపీపీ గండవరం సుగుణ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. పార్టీ కన్వీనర్ మెట్టాకు పార్టీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన చేత కేక్ కట్ చేయించినారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు పోలిరెడ్డి చిన్నపరెడ్డి, గ్రామ సచివాలయాల కన్వీనర్ నెల్లూరు శివప్రసాద్, సర్పంచులు లక్ష్మి , పల్లికొండ పెంచల ప్రతాప్ ముదిరాజ్, అలపాక శ్రీనివాసులు, కావలి విజయ్ కుమార్, ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు నడవడి ముత్యం గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ జమీల్, మైనార్టీ నాయకులు షేక్ మస్తాన్( అగ్ని) కృష్ణపట్నం, తాళ్లపూడి ఉప సర్పంచ్ లు రాగాల వెంకటేశ్వర్లు, అల్లంపాటి గోపాల్, మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు తూపిలి శ్రీధర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, గండవరం సూరి, వైకాపాల ఎంపిటిసి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ గండవరం మాట్లాడారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సహకారంతో కార్యకర్తల అభ్యున్నతికి పార్టీ కన్వీనర్ మెట్టా పనిచేస్తున్నారని అభినందించినారు. ఈ కార్యక్రమం తర్వాత తాళ్లపూడి లోని మెట్టా విశ్రాంతి భవనం నందు ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement