Sunday, April 28, 2024

AP | నెల్లూరు జిల్లాలో వైసీపీలో చేరిన టీడీపీ, జనసేన నేత‌లు

నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేనకు భారీ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పారు. సీఎం వైయస్ జగన్ సమక్షంలో జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డితో పాటు నెల్లూరు మండల అధ్యక్షుడు కాటం రెడ్డి జగదీశ్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజెర్ల సుబ్బారెడ్డి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి. విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement