Sunday, April 28, 2024

ఏపీ జెన్‌కో థర్మల్ కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి..

ముత్తుకూరు : మండలంలోని నేలటూరు గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ ఉత్పత్తి సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఏపీ జెన్‌కో బొగ్గు ఆధారత థర్మల్ కేంద్రంలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికుడు దారాహరిబాబు(38) మృతి చెందారు. శుక్రవారం ఈ సంఘటన జరిగింది. మృతుడు కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పని చేస్తున్న స‌మ‌యంలో ఒకసారిగా ఛాతిలో నొప్పి రావడంతో దారాహ‌రిబాబు కింద పడిపోయారు. ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. గుండె పోటు వల్ల కార్మికుడు మృతి చెందినట్లు సహచర కార్మికులు తెలిపారు. మృతుడు నేలటూరు దళితవాడ గ్రామానికి చెందినవారు. మృతుడు కుటుంబానికి ఆర్థిక సహకారం అందిస్తామని ప్రాజెక్ట్ యాజమాన్యం హామీ ఇచ్చింది. మృతుడు కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తూనే పంచాయతీ పాలకవర్గంలో ఆరో వార్డు సభ్యుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement