Monday, April 29, 2024

Nara Lokesh: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్కటే మార్గం

Nఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 800 రోజలుకు చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. నియంతగా మారిన పాల‌కుల విద్వేష నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా 800 రోజులుగా జై అమరావతి నినాదంతో మొక్క‌వోని దీక్ష‌తో పోరాడుతున్న‌ రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు తెలిపారు. రాష్ట్రానికి అమ్మ లాంటి అమరావతిని కూల్చాలని కుట్ర చేసిన జగన్..అన్ని రంగాల‌ని కుప్పకూల్చారని విమర్శించారు. సంకుచిత బుద్దితో జగన్ అండ్ కో ప్రజారాజధానిని కేంద్రంగా చేసిన ప్రతీ ఆరోపణ అబద్ధమేనని నిరూపిస్తూ అమరావతి ఠీవిగా నిలబడిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆపేసిన అమరావతి గ్రోత్ ఇంజిన్ ని తిరిగి స్టార్ట్ చెయ్యడం ఒక్కటే మార్గం అని నారా లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement