Monday, April 29, 2024

Breaking: వ్యాపమ్​ కుంభకోణంలో ఐదుగురు నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

వ్యాపమ్ సంబంధిత పోలీసు రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఐదుగురు నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) భోపాల్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. వ్యాపమ్ 2012లో నిర్వహించిన పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులతో సహా ఐదుగురు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (MPRE) నిర్వహించే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను వ్యాపమ్ అని కూడా అంటారు.

నిందితులను అనేక రామ్, నర్ సింగ్, గిరిరాజ్ (ముగ్గురు అభ్యర్థులు), రాజు కుమార్. నవల్ కుమార్ (అనుకరణదారులు)గా గుర్తించారు. వారందరికీ భారతీయ శిక్షాస్మృతి, MPRE చట్టాల సంబంధిత సెక్షన్ల కింద రూ.10,000 జరిమానాతో పాటు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది. జనవరిలో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, 2010లో నిర్వహించిన ప్రీ-మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ లో మరొక అభ్యర్థిని మోసగించడంలో ప్రమేయం ఉన్నందుకు జరిమానాతో పాటు కఠిన కారాగార శిక్ష విధించారు.

ఐదుగురు నిందితులకు శిక్ష

అంతకుముందు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భోపాల్ పోలీసుల నేతృత్వంలోని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విచారణ చేపట్టింది. 2015లో ముగ్గురు అభ్యర్థులు మధ్యవర్తులను సంప్రదించి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి పెద్ద మొత్తం చెల్లించారని ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ తర్వాత, 2017, జూన్ 30న భోపాల్‌లోని అదనపు సెషన్స్ జడ్జి (ASJ) కోర్టు ముందు అభ్యర్థులు, మధ్యవర్తులతో సహా తొమ్మిది మంది నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. కాగా, ట్రయల్ కోర్టు ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. సాక్ష్యాధారాలు లేని కారణంగా నలుగురు మధ్యవర్తులను కోర్టు విడుదల చేసి నిర్దోషులుగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement