Wednesday, May 15, 2024

Nara Lokesh: పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకు?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. పేలని జ‘గన్’ హస్తిన పయనం ఎందుకు అని ప్రశ్నిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.

‘’బాబాయ్ హత్య కేసులో దొరికిన అవినాష్ రెడ్డిని తప్పించేందుకు. తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ. 48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేయాలని. తనపై సిబిఐ, ఈడి కేసుల దర్యాప్తు ఆపేయాలని, లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లిగవ్వ కూడా దక్కకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని కోరేందుకు ఢిల్లీకి వెళ్తున్నారా?’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement