Thursday, May 2, 2024

AP: నారా లోకేష్ మలివిడత శంఖారావం.. 7న హిందూపురం నుంచి శ్రీకారం

అమరావతి: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడం, పార్టీ కేడర్ ను ఎన్నికలకు సంసిద్ధం చేయడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన శంఖారావం మలివిడత యాత్ర ఈసారి రాయలసీమలో చేపట్టనున్నారు. ఈనెల 7వతేదీన (గురువారం) హిందూపురం నుంచి యువనేత నారా లోకేష్ మలిదఫా యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రాబోయే ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోవాలన్న అంశంపై కేడర్ కు యువనేత దిశానిర్దేశం చేస్తారు. ఈ సందర్భంగా మన టీడీపీ, బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల అమలులో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలతో భేటీ అయి వారికి ప్రశంసాపత్రాలను అందజేస్తారు.

తొలివిడతలో ఉత్తరాంధ్రలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపింది. టీడీపీ-జనసేన కార్యకర్తలతో పాటు పెద్దఎత్తున ప్రజలు శంఖారావం సభలవద్దకు చేరుకొని సైకోపాలనలో తాము పడుతున్న ఇబ్బందులను యువనేతకు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో శంఖారావం మలివిడత యాత్రను తన మామ, ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి ప్రారంభించనున్నారు. తొలిరోజు 7వతేదీ ఉదయం హిందూపురం, మధ్యాహ్నం మడకశిర, సాయంత్రం పెనుకొండ నియోజకవర్గాల్లో నిర్వహించే శంఖారావం సభల్లో యువనేత లోకేష్ పాల్గొంటారు. 8వతేదీన ఉదయం పుట్టపర్తి, మధ్యాహ్నం కదిరి సభలకు లోకేష్ హాజరవుతారు. శివరాత్రి నేపథ్యంలో 9వతేదీన యాత్రకు తాత్కాలిక విరామం ఉంటుంది. తిరిగి ఈనెల 10వతేదీనుంచి శంఖారావం యాత్ర యథావిధిగా కొనసాగనుంది.

యువగళం స్పూర్తితోనే శంఖారావం…
జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు స్వాంతన చేకూర్చి ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా యువనేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అధికారపార్టీకి కంటిమీద కునుకులేకుండా చేసింది. 226రోజులపాటు 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3132 కి.మీ.లు సాగిన పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు నేరుగా పాల్గొని తమ కష్టాలు చెప్పుకున్నారు. యువగళానికి ప్రజల నుంచి లభించిన అనూహ్య స్పందనను తట్టుకోలేక ఏవిధంగానైనా అడ్డుకోవాలనే దుర్భుద్ధితో జగన్ ప్రభుత్వం కుట్రపన్నింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడును తప్పుడు కేసుల్లో ఇరికించి జైలులో పెట్టడంతో యువగళానికి 79రోజులపాటు సుదీర్ఘ విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విశాఖ జిల్లా అగనంపూడి వద్ద యువగళాన్ని గత ఏడాది డిసెంబర్ 18వతేదీన అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సిద్ధంచేయడంతో పాటు బాబు సూపర్ – 6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువనేత లోకేష్ శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేయడంలో సూపర్ సక్సెస్ సాధించిన యువగళం స్పూర్తితోనే లోకేష్ శంఖారావాన్ని పూరించారు.

- Advertisement -

యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు..
ఉమ్మడి అనంతపురం జిల్లా
7-3-2024 (గురువారం) కార్యక్రమ వివరాలు..
ఉమ్మడి అనంతపురం జిల్లా
హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
(జిటిఎం లేఅవుట్, లోటస్ పబ్లిక్ స్కూలు దగ్గర)
ఉదయం
10.00 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.
10.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.
10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
10.32 – హిందూపూర్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఆకుల ఉమేష్ ప్రసంగం.
10.34– హిందూపూర్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ నందమూరి బాలకృష్ణ ప్రసంగం.
10.36– హిందూపూర్ నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
12.00 – యువనేత నారా లోకేష్ మడకశిర నియోజకవర్గానికి చేరిక.
2.30 – మడకశిర నియోజకవర్గంలో భోజన విరామం.
మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం
(చీపులేటి గ్రామం, మడకశిర మున్సిపాలిటీ)


మధ్యాహ్నం
2.30 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.
2.35 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.
2-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
3.02 – మడకశిర నియోజకవర్గ జనసేన సమన్వయకర్త టి.రంగస్వామి ప్రసంగం.
3.04 – మడకశిర నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఎమ్.ఈ సునీల్ కుమార్ ప్రసంగం.
3.06– మడకశిర నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
3.26– పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ ముఖాముఖి.
3.54– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.
3.58– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
3.59 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.
4.55 – యువనేత పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
పెనుకొండ నియోజకవర్గం
(తేజో కిరణ్ ఫ్యాక్టరీ, మడకశిర రోడ్, పెనుకొండ)


సాయంత్రం
5.00 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.
5.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.
5-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
5.32 – పెనుకొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఈడిగ కుమార్ ప్రసంగం.
5.34 – పెనుకొండ నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ ఎస్.సవిత ప్రసంగం.
5.36 – పెనుకొండ నియోజకవర్గ శంఖారావంలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.
5.56 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేష్ ముఖాముఖి.
6.26 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
6.28 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేష్ ప్రతిజ్ఞ.
6.29 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
6.30 – రోడ్డుమార్గం ద్వారా పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రయాణం
7.15 – పుట్టపర్తి నియోజకవర్గానికి చేరుకుని, అక్కడ బస చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement