Saturday, April 27, 2024

Nara lokesh: జే బ్రాండ్స్ బాగోతం.. చెత్త బ్రాండ్లు తెచ్చింది జగనే..

రాష్ట్రంలో చెత్త బ్రాండ్లు తెచ్చింది జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతితో సహా చంద్రబాబు తెచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన జగన్.. అవి తమ బ్రాండ్లు అయితే రద్దు చెయ్యకుండా ఉండేవారా? అని ప్రశ్నించారు. వైసీపీ హాయాంలో 141 కోత్త బ్రాండ్ లు వచ్చాయని ప్రభుత్వమే ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చిందన్నారు. సభలో చర్చకు అనుమతి ఇస్తే జే బ్రాండ్స్ బాగోతం బయటపడుతుందన్నారు. మండలి ఛైర్మెన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని మంపడ్డారు.

రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నదే తమ సింగిల్ పాయింట్ ఎజెండా అని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఒకే రాజధాని అని ఉంది తప్ప.. రాజధానులు అని లేదని తెలిపారు. దాని ఆధారంగానే కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. రాజధాని అంశానికి సంబంధించి ఇచ్చిన తీర్పుని పట్టుకొని శాసనసభకి ఏ అధికారాలు లేవా ? అంటూ ప్రజల్ని జగన్ రెడ్డి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తీర్పులను గౌరవించకుండా న్యాయ వ్యవస్థను కించపరిచేలా శాసనసభ వేదికగా మాట్లాడటం బాధాకరం అని పేర్కొన్నారు. పదో తరగతి ఫెయిల్ అయిన వైసిపి నాయకులుకు, అసలు ఏమి చదివాడో తెలియని జగన్ రెడ్డికి చట్టాల గురించి ఏం తెలుస్తుందని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ తాము చేసి చూపించాం అని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో… మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చర్చకు సిద్దమా..? అని సవాల్ విసిరారు. చంద్రన్న పెళ్లి కానుక, అన్నా క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య… ఇలాంటివి చంద్రబాబు బ్రాండ్లు అని నారా లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement