Thursday, May 2, 2024

నారా లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కూడేరులో క్రేన్‌ నుంచి తెగిన గజమాల లోకేశ్‌పై పడింది. ఒక్కసారిగా వేలాది మంది అభిమానులు లోకేష్ వద్దకు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈక్రమంలో శ్రేణులు క్రేన్‌కు వేలాడదీసిన భారీ గజమాలను లాగడంతో అది లోకేష్ ఉన్న చోట ఒక్కసారిగా తెగిపడింది. తృటిలో ప్రమాదం తప్పడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement