Sunday, April 28, 2024

AP: బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డిని కలిసిన నంద్యాల ఎంపీ

ఆళ్ళగడ్డ, (ప్రభ న్యూస్) : ఆళ్లగడ్డ బీజేపీ ఇంచార్జి భూమా కిషోర్ రెడ్డిని శనివారం నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి భూమా నివాసంలో కలిసి మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎంపీ పోచా ఆయనను వైసీపీ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక శైలి కలిగి, భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్న భూమా కిషోర్ రెడ్డి ఇది తన ఒక్క నిర్ణయమే కాదని, భూమా కుటుంబ కార్యకర్తలతో కూడా చర్చించిన పిదప నిర్ణయం తీసుకుంటానని ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డికి వివరించినట్లు బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో విజయ పాల డైరీ చైర్మన్ ఎస్ వి జగన్మోహన్ రెడ్డి, బీజేపీ నేతలు సింగం భరత్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement