Sunday, May 19, 2024

AP | సీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు ఎంవీఆర్‌ పేరు.. ఉత్తర్వుల జారీ

తిరుపతి, (రాయలసీమ ప్రభన్యూస్‌ బ్యూరో) : వైఎస్సార్‌ కడప జిల్లాలోని కల్లమల వద్ద ఉన్న రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (ఆర్‌టీటీపీ) కి స్వర్గీయ ఎంవీ రమణారెడ్డి పేరు పెడుతూ ఇవ్వల (గురువారం) రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన వారిలో ప్రొద్దుటూరుకు చెందిన ఎంవీ రమణారెడ్డి ప్రముఖులు. సీమ సమస్యల పై ఎన్నో రచనలు చేసి ప్రజలలో అవగాహన పెంచారు.

రాయలసీమ ఉద్యమ నేతగా, రాజకీయ ప్రతినిధిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞ ను కనబరిచిన రమణారెడ్డి ఇటీ-వలే మరణించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆయన పేరును రాయలసీమ వాదులు పోరాడి సాధించుకున్న ఆర్‌టీటీపీకి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈరోజు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement