Monday, April 29, 2024

Nagari – ఆ పార్టీ లను భోగి మంటల్లో వేసి కాల్చడం ఖాయం – రోజా

నగరి – గ్రామాల్లో పాత వస్తువులు, సామాగ్రిని భోగి మంటల్లో వేసి తగులబెట్టడం ఆనవాయితీగా వస్తోందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన పార్టీ కూటమిని రాష్ట్ర ప్రజలు అదే రీతిలో మంటల్లో పడేస్తారని అన్నారు. చెత్త పార్టీలు, వారి ఆలోచనలను, అమలు చేయని మేనిఫెస్టోను జనం భోగీ మంటల్లో వేసి కాల్చేస్తారని చెప్పారు పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా.

ఈ తెల్లవారు జామున. చిత్తూరు జిల్లా నగరిలోని తన నివాసం వద్ద ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భోగీ మంటలను వెలిగించారు. రాష్ట్ర ప్రజలకు భోగీ, సంక్రాంతి పండగ శుభాకాంక్షలను తెలిపారు.

అనంతరం మీడియా తో మాట్లాడుతూ ,ఈ రాష్ట్రానికి పట్టిన టీడీపీ-జనసేన అనే పీడను శాశ్వతంగా తొలగించడానికి జనం సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి పట్టం కట్టడం కోసం జనం ఎదురు చూస్తోన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన పరిపాలనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తారని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement