Monday, May 6, 2024

వైసిపికి మునగపాటి గుడ్ బై!

మంగళగిరి- ఏప్రిల్ 22, ప్రభ న్యూస్ : వైసిపి నాయకులు, శివాలయం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆర్కే కు లిఖిత పూర్వకంగా లేఖ రాశారు. తాను తన భార్య విజయలక్ష్మి వ్యక్తిగత కారణాల వలన పార్టీకి రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. తనను గుర్తించి శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

మునగపాటి వెంకటేశ్వరరావు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీని వీడి వైసీపీలో చేరారు. చేరిన కొద్ది రోజులకు పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న సీనియర్లను కూడా పక్కన పెట్టి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వెంకటేశ్వరరావుకు శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని కేటాయించారు. చైర్మన్ గా పదవీకాలం పూర్తయ్యే దశలో కొంతకాలం పొడిగింపునకు ప్రయత్నించారు. క్రొత్త వారికి అవకాశం కల్పించాల్సి రావడంతో ప్రయత్నాలు సఫలం కాలేదు. కీలకమైన నామినేటెడ్ పదవిలో పనిచేసినప్పటికీ తాజాగా పార్టీని వీడుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement