Tuesday, April 30, 2024

ప్రజల గళంను యువ గళంగా చేసుకున్న లోకేష్ – ఎంపి రామ్మోహన్

ఇచ్చాపురం , ఫిబ్రవరి 11(ప్రభ న్యూస్): రాష్ట్రప్రజలందరి గొంతును యువగళంగా మార్చుకుని లోకేష్ పాదయాత్ర చేశారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నారా లోకేష్ శంఖా రావం యాత్ర ప్రారంభమైన ఇచ్చాపురం సభలో ఆయన మాట్లాడుతూ,
ఇచ్ఛాపురంలో తెలుగుదేశం ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా పసుపు జాతరే అని అన్నారు
ఇచ్ఛాపురంలో యువగళం పాదయాత్ర ముగించాల్సి ఉన్నా అవాంతరాల వల్ల రాలేకపోయారని,, ఇచ్ఛాపురం వస్తాననే మాట ప్రకారం లోకేష్ ఈ గడ్డపై శంఖారావంతో ఇప్పుడు అడుగుపెట్టారని తెలిపారు
జగన్ రెడ్డి పాలన అంతానికి లోకేష్ శంఖారావం పూరించారని, ఈ శంఖారావం మనం కోసం, రైతులు, యువకులు, బడుగు, బలహీనవర్గాల కోసం అని తెలిపారు.


జగన్ రెడ్డిని నమ్మి రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని, ఐదేళ్లు తాడేపల్ల ప్యాలెస్ లో గడిపిన జగన్ రెడ్డి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించా చారు .చంద్రబాబు ఢిల్లీ వస్తే.. పాత్రికేయులు ఏం అడుగుతారోనని జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్నారు జగన్ రెడ్డి ఢిల్లీ వస్తే ఆ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా రాలేదని ఎంపీ తెలిపారు
జగన్ రెడ్డి పని అయిపోయిందని వైసీపీ నేతలకు కూడా తెలిసిపోయిందని,ఒకరు దుబాయి పారిపోయారని, మరికొందరు నియోజకవర్గాలకు పారిపోయారని అన్నారు.
అనేక తుఫానులను ఎదుర్కొన్నామని, జగన్ రెడ్డిని ఓడించడం పెద్ద లెక్క కాదని రామ్మోహన్ నాయుడు అన్నారు
2014-19 మధ్య అనేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.


టీడీపీ అధికారంలోకి వస్తే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తిచేస్తామని తెలిపారుటీడీపీ అంటే తెలుగు ప్రజల గుండెల్లో ఉండే పార్టీ అన్నారు. పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై గళమెత్తడం జరిగిందని తెలియచేస్తూ,
25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామన్న జగన్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు జగన్ కు ప్రజలవద్దకు వెళ్లి ఓట్లడిగే దమ్ము లేక భయపెట్టి ఓట్లు వేయించుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.ప్రకృతి విపత్తులకే భయపడని మేం… జగన్ ఉడత ఊపులకు భయపడతామా? అని అన్నారు. రాబోతున్న కాలంలో ఇచ్చాపురం నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టాలంటే టిడిపిని గెలిపించాలన్నారు.

టిడిపి హయాంలో కోట్లాదిరూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని,రైతులకు సాగునీటి కాల్వల కోసం రూ.4కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామన్నారు. అయిదేళ్లలో కెనాల్స్ లో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని విమర్శించారుటిడిపి – జనసేన ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించాలని కోరారు.

రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఇచ్చాపురం నియోజకవర్గంలో పసుపుజెండా ఎగురవేసి లోకేష్ కు కానుకగా ఇద్దామన్నారు. ప్రత్యేక హోదా తెస్తానంటే నమ్మి ఎంపిలను గెలిపిస్తే ముఖం చాటేశాడని విమర్శించారు.
తెలుగువారి గళం డిల్లీలో వినపడాలంటే తెలుగుదేశం పార్టీని ఘనవిజయంతో గెలిపించాలని పులుపునిచ్చారు
రెడ్ బుక్ లో పేర్లున్న అధికారులు, నేతలు ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాల్సిందనని అన్నారు.రాబోయే శంఖారావం ద్వారా యువనేత లోకేష్ దిశానిర్దేశం చేయబోతున్నారని తెలిపారు.
……

Advertisement

తాజా వార్తలు

Advertisement