Saturday, April 27, 2024

క‌ర్నూలులో హైకోర్టు పెట్టేప‌రిస్థితులు ఉన్నాయా?

రాజ‌ధానుల‌పై ఏపీ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ అవ‌గాహ‌న లేకుండా వ్యాఖ్య‌లు చేస్తున్నారని వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆయ‌న మాట‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ద్దని తెలిపారు. క‌ర్నూలులో హైకోర్టు పెట్టేప‌రిస్థితులు ఉన్నాయా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. క‌రోనా కేసుల సంఖ్య కంటే ప్ర‌భుత్వంపైనే ఎక్కువ కేసులు న‌మోదయ్యాయ‌ని చెప్పారు. అన్ని ప్ర‌భుత్వ విభాగాలు ఒకేచోట ఉండాల‌ని ప్ర‌జ‌లు భావిస్తారని ఆయ‌న తెలిపారు. క‌ర్నూలులో హైకోర్టు పెడితే అధికారులే అక్క‌డికి వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉంటుంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం విప‌రీతంగా అప్పులు చేస్తోందని రఘురామ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement