Saturday, May 4, 2024

CBI విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితమే అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. సాయంత్రం 6గంటల వరకు అవినాష్ ను విచారించే అవకాశముంది. ఈనెల 25వ తేదీ వరకు అరెస్ట్ వద్దని కోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చింది. అలాగే ఇదే కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు. భాస్కర్ రెడ్డిని, ఉదయ్ కుమార్ రెడ్డిని ముందుగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఇద్దరిని సీబీఐ కస్టడీలోకి తీసుకోనున్నారు. అదేవిధంగా తండ్రి భాస్కర్ రెడ్డిని, కొడుకు అవినాష్ రెడ్డిని ఇద్దరిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement