Thursday, May 2, 2024

మోపిదేవి స్వామి సేవలో
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ

మోపిదేవి : కృష్ణా జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్ దర్శించుకున్నారు.ఉద‌యం ఆలయానికి వచ్చిన వాణి మోహన్ కు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.తొలుత ఆమె ఆలయంలో ప్రదక్షణలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పాలు పోసి, మొక్కుబడులు చెల్లించుకున్న అనంతరం వాణి మోహన్ శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆమె ఆలయంలో సర్ప దోష నివారణ పూజలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఆమె ఆలయంలో నిద్ర చేశారు. వాణి మోహన్ కు ఆలయ సహాయ కమిషనర్ లీలాకుమార్ స్వామి వారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను అందించి, ఆలయ మర్యాదలతో సన్మానించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement