Monday, April 29, 2024

ఆయుర్వేద మందుతో సైడ్ ఎఫెక్ట్స్ రాలేదుః ఎమ్మెల్యే కాకాని

ఆనందయ్య ఆయుర్వేద మందుతో ఎక్కడా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే వేల మందికి ఆయుర్వేద మందు పంపిణీ చేశారని తెలిపారు. ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందని కరోనా బాధితులు చెబుతున్నారన్నారు. వేల మంది రావడం వల్ల ఇబ్బంది కలుగుతోందని, ఈరోజు సాయంత్రం ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకి చేరుకుంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావద్దని ఎమ్మెల్యే కాకాని కోరారు. వేల మంది రావడం వల్ల పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈరోజు సాయంత్రానికి ఆయుష్ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు, క్లీన్ చిట్ వస్తే ఇతర రాష్ట్రాల వారికి కొరియర్ చార్జీలు కూడా తామే భరించి మందులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం సాంకేతికంగా మరింత పరిశీలించాలని భావించి ఐసీఎంఆర్ ను పంపిస్తోందన్నారు. ఈ నిర్ణయం పట్ల ఎమ్మెల్యే కాకాని హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement