మంగళగిరి రూరల్, (ప్రభ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో బాలికలు మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు. మంగళగిరి మండలం కాజ టోల్ గేట్ వెంబడి గల ఆమోదీని బాలికల ఆశ్రమం నుండి ఇద్దరు బాలికలు అదృశ్యం అయినట్లు గత నెల 31న ఆశ్రమ ఇన్చార్జి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ రాంబాబు పర్యవేక్షణ లో సీఐ భూషణం, ఎస్సై విజయ్ కుమార్ రెడ్డితో కలిసి పోలీసు సిబ్బంది దీనిపై దర్యాప్తు చేపట్టారు. అయితే తెనాలి బస్టాండ్ వద్ద బాలికల ఆచూకీ కనుగొని వారిని సీడబ్ల్యుసీ వారికి అప్పగించినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ఇద్దరు బాలికలను కాపాడి కేసును ఛేదించిన సీఐ భూషణం, ఎస్సై విజయ్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, రమేశ్ను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అభినందించారు.
ఏపీలో వీడిన బాలికల మిస్సింగ్ మిస్టరీ.. ఆశ్రమానికి సురక్షితంగా చేర్చిన పోలీసులు
Advertisement
తాజా వార్తలు
Advertisement