Sunday, May 5, 2024

స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న మంత్రి విడదల రజిని

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి విడదల రజిని విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విశాఖ వచ్చిన విడదల రజని పీఠాధిపతుల ఆశీస్సుల కోసం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. వైద్య ఆరోగ్య శాఖను విజయవంతంగా నిర్వహించేలా దీవించమంటూ పీఠాధిపతులను కోరారు. అనంతరం రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement