Thursday, April 25, 2024

Flash: యువ‌తి ఇంటి ముందు యువ‌కుడు ఆత్మహత్య

ప్రేమ విఫ‌ల‌మైంద‌న్న కార‌ణంతో యువ‌తి ఇంటిముందు ఓ యువ‌కుడు పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని మండ‌లం గుంజ‌ప‌డుగులో చోటు చేసుకుంది. ఆ గ్రామంలోని త‌న ప్రేయ‌సి ఇంటిముందుకు పెట్రోలుతో వెళ్లిన యువ‌కుడు.. నిప్పు అంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంట‌లు ఆర్పి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.  అయితే, ఆ యువ‌కుడిని చికిత్స కోసం క‌రీంన‌గ‌ర్  ప్ర‌భుత్వ ఆసుప‌త్రి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి స్వ‌స్థ‌లం వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లం పాప‌య్య‌పేటకు చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement