Thursday, May 9, 2024

కళాకారులకు చేయూతనిచ్చిన ద్వారావతి ఫౌండేషన్

కరోనా వల్ల అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  350మంది కళాకారులు కు నిత్యావసర వస్తువులు అందజేశారు. నెల రోజులకు సరిపడా బియ్యం, కందిపప్పు, నూనె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాలతో ఉచితంగా రేషన్, ఇతర వస్తువులు అందిస్తున్నామన్నారు. సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పధకాలు అందించడం సీఎం గొప్పతనం అని అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ద్వారావతి ఫౌండేషన్ కళాకారులకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం అభినందనీయం ప్రశంసించారు. ప్రదర్శనలు లేక పేద కళాకారులు ఎంతో మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. కష్ట సమయంలో ఈ సాయం కొండంత భరోసా ఇస్తుందన్నారు.

కరోనా వల్ల చాలా మంది పేదలు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారని ద్వారావతి ఫౌండేషన్ ప్రెసిడెంట్ చలవాది మల్లికార్జున రావు తెలిపారు. పేదల కోసం క్వారంటైన్ సెంటర్ లు పెట్టామని చెప్పారు. నాలుగు‌ వందల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. కళాకారుల బాధలు చూసి గతంలో కొంత సాయం చేశామన్నారు. కష్ట సమయంలో కడుపు నింపేలా నెలకి సరిపడా సరుకులు అందిస్తున్నామని చెప్పారు. పేదల కోసం నిత్యాన్నదానం ఏర్పాటు చేసి.. నిరాశ్రయుల కడుపు నింపుతున్నామని తెలిపారు. అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ఉచిత ఆసుపత్రి త్వరలో ప్రాభించనున్నామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement