Monday, April 29, 2024

శ్రీకాళహస్తీశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

శ్రీకాళహస్తీశ్వర స్వామికి రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలత దంపతులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి మంత్రి రామచంద్రారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన భూ కైలాస్ ను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడంతో పాటుగా, స్వామి వారి దయ తమ ప్రభుత్వం పైనా, తమ పార్టీ పైనా ఉండాలని ప్రార్థించానన్నారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరింత బలాన్ని చేకూర్చాలని కోరుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement