Sunday, May 5, 2024

తూర్పులోని ప‌వ‌న్ రెండు స‌భ‌లు అట్ట‌ర్ ప్లాప్ – మంత్రి దాడిశెట్టి..

తుని: పవన్‌ తన నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని, గంటకో నిర్ణయం, పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తన యజమాని చంద్రబాబు మెప్పు కోసం పవన్‌ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. తునిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌ పెట్టిన రెండు మీటింగ్‌లు అట్టర్‌ ప్లాప్‌ అయ్యాయని చెప్పారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇండిపెండెంట్‌గా చాలా మంది గెలిచారని, పార్టీ పెట్టి కూడా పవన్‌ గెలవలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌ ఎక్కడ పోటీ చేస్తారో ఆయనకే క్లారిటీ లేదన్నారు. అందుకే
పవన్‌ కళ్యాణ్‌ను ఆ పార్టీ నేతలు మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాల‌ని సూచించారు.. పవన్‌ తిరిగేది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో..ఇప్పటికీ రెండు చోట్ల బహిరంగ సభలు పెడితే రెండు చోట్ల ఫెయిల్ అంటూ విమ‌ర్శించారు..క‌నీసం ప‌వ‌న్ స‌భ‌కు 4 వేల మంది కూడా రావడం లేంటూ ఎద్దేవా చేశారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement