Tuesday, April 30, 2024

తుది దశకు సంగం బ్యారేజ్ పనులు.. మేలో ప్రారంభిస్తామన్న మంత్రి అనిల్

నెల్లూరు జిల్లాలోని సంగం, పెన్నా బ్యారేజ్‌ పనులు తది దశకు చేరుకున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. మేలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వీటిని ప్రారంభిస్తారని వెల్లడించారు. పెన్నా బ్యారేజ్‌ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ శనివారం పరిశీలించారు. కాంక్రీట్‌ వాల్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పెన్నా, సంగం బ్యారేజ్‌ నిర్మాణ పనులు పూర్తయితే సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని చెప్పారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌గా నామకరణం చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement