Sunday, May 5, 2024

AP PG CET: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ పీజీ సెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో విడుదల చేశారు. పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎమ్మెస్సి , ఎం.కామ్, యంఏ, ) తదితర కోర్సుల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల మంత్రి సురేష్ విడుదల చేశారు. ప్రవేశ పరీక్షకి 35,573 మంది హాజరు కాగా 24,164 మంది అర్హత సాధించారు. పీజీ సెట్‌లో 87.62 శాతం మంది అర్హత సాధించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాలకి ఒకే సెట్ మొదటిసారిగా నిర్వహించాం. ఆన్‌లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలని రెండు వారాలలో ప్రకటించామన్నారు.  అక్టోబరు 22 నుంచి 26 వరకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు 35,573మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్ష నిర్వహించిన 15 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసామని అన్నారు. గతంలో అన్ని యూనివర్సిటీలకి ఒకే ప్రవేశ పరీక్ష ఉండకపోవడం వల్ల విద్యార్ధులకి అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి అన్నారు. ఈ ప్రవేశ పరీక్ష వల్ల అర్హత సాధించిన విద్యార్ధులు తమకు ఇష్ణమైన కోర్సులలో నచ్చిన యూనివర్సిటీలో చేరవచ్చు అని తెలిపారు. ఉన్నత విద్యలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఒకే సిలబస్ అమలు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement