Sunday, April 28, 2024

లోన్ కావాలా?.. కర్నూల్ లో బ్యాంకుల మెగా రుణ మేళా

కేంద్ర ప్రభుత్వం అధీనంలో వున్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆదేశాలకు ప్రకారం.. జిల్లా లీడ్ బ్యాంక్ అధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని అన్ని బ్యాంకులు సంయుక్తంగా మెగా రుణ మేళాను నిర్వహించున్నారు. అక్టోబర్ 29 వ తేదీన రావూరి కన్వెన్షన్ హాల్ తో ఈ మెగా రుణ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని బ్యాంకులు తమ స్టాల్స్ ద్వారా ప్రజలకు బ్యాంకులు అందించే రుణ సదుపాయాలపై అవగాహన కల్పించనున్నారు.

ఈ రుణ మేళా కార్యక్రమంలో అర్హులైన లబ్దిదారులకు గృహ,వాహన,విద్య,వ్యాపార రుణాలు, వ్యవసాయ రుణాలు, అలాగే ప్రభుత్వ పథకాలైన ముద్ర, పీఎం స్వనిధి, స్టాండ్అప్ ఇండియా,పి. ఎమ్ ఈజీపి, పిఎమ్ఎఫ్ఎంఈ, టిడ్కో హౌసింగ్ లోన్స్, ఇతర ఋణాలు ఇవ్వనున్నారు. జిల్లాలోని బ్యాంకులు అన్ని ప్రజల వద్దకే వచ్చి రుణాలపై అవగాహన కల్పిస్తూ..ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్న తరుణంలో ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని  అర్హులైన లబ్ధిదారులు రుణాలు పొందేందుకు వున్న అవకాశాన్ని ఉపయోగంచుకోవాలని నిర్వహకులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement