Monday, April 29, 2024

Breaking: శ్రీశైలంలో మెడికో ఆత్మహత్య..

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో మెడికో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఏపీఎస్పీడీసీఎల్ శ్రీశైలం ఏఈగా విధులు నిర్వహిస్తున్న సత్య నారాయణ కుమార్తె ధరణి ఇవాళ తెల్లవారుజామున తమ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె బెంగళూరులో మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.


రెండు రోజుల క్రితం వెలువడిన పరీక్ష ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీశైలం ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement