Sunday, April 28, 2024

ఏపీలో ప‌లువురు ఐఏఎస్‌ల బదిలీలు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ గా పనిచేస్తున్న ఎం గిరిజాశంకర్‌ ను స్టేట్‌ టాక్సెస్‌ ప్రధాన కమిషనర్‌గా నియమించింది. ప్రస్తుతం ఆ స్థానంలో పనిచేస్తున్న ఐఆర్‌ఎస్‌ అధికారి సీహెచ్‌ రాజేశ్వరరెడ్డి రిలీవ్‌ కావటంతో ఖాళీ ఏర్పడింది. కాగా సాధారణ పరిపాలన విభాగం సర్వీసెస్‌ కార్యదర్శిగా పనిచేస్తున్న మరో ఐఏఎస్‌ అధికారి హెచ్‌ అరుణ్‌కుమార్‌ ను పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా బదిలీచేస్తూ ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మెంబర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను కొనసాగించింది.

కళాశాల విద్య కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 2005 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి పోలా భాస్కర్‌ను జీఏడీ సర్వీసెస్‌ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement