Sunday, April 28, 2024

మన్యం జిల్లాలో.. వ్యక్తి దారుణ హత్య

కురుపాం మండలం జి.శివడ పంచాయతీ వేపమానుగూడ గ్రామంలో ఓ గిరిజనుడు హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన పాలక ఇండియా (30) అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో దారుణంగా హ‌త్య చేయ‌బ‌డ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఎల్ వి పేట సి.ఐ సత్యన్నారాయణ, కురుపాం, నీలకంఠాపురం ఇన్ఛార్జ్ ఎస్.ఐ.షణ్ముఖరావు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement