Saturday, April 27, 2024

Breaking | బైకుపై వెళ్తుంటే గుండెపోటు.. అదుపుత‌ప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో వ్య‌క్తి మృతి

బుచ్చిరెడ్డిపాలెం (ప్రభ న్యూస్) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చ‌నిపోయిన‌ ఘటన నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఇవ్వాల (బుధ‌వారం) సాయంత్రం జ‌రిగింది. పెనుబల్లి గ్రామం, రాజరాజేరాజేశ్వరి రైస్ మిల్లు సమీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పెనుబల్లి నుండి బుచ్చిరెడ్డిపాలెం వైపు ద్విచక్ర వాహనం వెళ్తున్న వాల్మ‌టి శ్రీ‌నివాసులురెడ్డి బైక్ ఆక‌స్మాత్తుగా అదుపుత‌ప్పింది. దీంతో ప‌క్క‌నే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన‌ శ్రీనివాసులు రెడ్డి (65) అకిడికక్కడే చ‌నిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై, కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. శ్రీనివాసులు రెడ్డికి గుండె పోటు రావడంతోనే ఆక‌స్మాత్తుగా పొలాల్లోకి బైకు దూసుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement