Wednesday, May 15, 2024

AP | ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయండి.. ముఖేష్ కుమార్

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన మీడియో కాన్పరెన్సు నిర్వహించి ఎన్నికల సంసిద్దత, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని ఈ లోపే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబందించిన తాజా మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించడం జరిగిందని, వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర అవగాహను పెంపొందించుకుని తగు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement