Friday, April 26, 2024

Machilipatnam: బీచ్ లో విషాదం .. స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

మ‌చిలీప‌ట్నం ప‌రిధిలోని మంగిన‌పూడి బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. భీమవరం విష్ణు కాలేజ్ లో బి.ఫార్మసీ చదువుతున్న కాకర ప్రమీల (22), కళ్ళేపల్లి పూజిత (22)లు గల్లంతయ్యారు. అయితే వారిని గుర్తించిన మెరైన పోలీసులు విద్యార్థుల్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే ఒడ్డుకు చేరిన 20 నిమిషాల్లో విద్యార్థులు మృతిచెందారు. సంఘటన స్థలానికి బందరు తాలుకా పోలీసులు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement