Sunday, April 28, 2024

Breaking : బైక్ ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. అచ్యుతాపురం వద్ద బైక్ ను లారీ ఢీకొట్ట‌డంతో ముగ్గురు మృతిచెందారు. మృతులు దుప్పితూరు ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది. అచ్యుతాపురం నుండి దుప్పితూరు వైపు వెళ్తుండగా వెనుక నుండి లారీ ఢీ కొట్టింది.

అచ్యుతాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను అనకాపల్లి హాస్పిటల్ కు తరలించారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ప్ర‌మాదానికి కార‌ణ‌మైన లారీ డ్రైవ‌ర్ ప‌రార‌య్యాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement