Saturday, April 27, 2024

మ‌హానాడులో లోకేశ్.. సెల్ఫీల కోసం ఎగ‌బ‌డిన యూత్

టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ రాజ‌మండ్రిలో జ‌రుగుతున్న మ‌హానాడు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కాగా లోకేశ్ రావడం చూసీ టీడీపీ కార్యకర్తలు నూతనోత్సాహంతో పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేరింతలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. అనేక మంది యువనేతతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. తన కోసం వచ్చిన కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన లోకేశ్ స్టేజీపై ఆసీనులయ్యారు. జనహృదయమైన నారా లోకేశ్ అంటూ యువగళం పాదయాత్రపై కేశినేని చిన్ని ముద్రించిన పుస్తకం కార్యకర్తల్లో ఆసక్తి రేకెత్తించింది. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అభిమానులు, కార్యకర్తలు లోకేశ్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ గుంటూరు జిల్లా ప్రతినిధుల రిజిస్టర్‌‌లో నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement