Thursday, May 2, 2024

న‌కిలీ బాబా మాట‌లు నమ్మి కూతురిపై తాంత్రిక పూజ‌లు.. విక‌టించి బాలిక మృతి!

పొక్లెయిన‌ర్ కొని ప‌నుల్లేక‌ న‌ష్ట‌పోయిన ఓ వ్య‌క్తి దీనికి కార‌ణం అదృష్టం లేక‌పోవ‌డ‌మే అని భావించాడు. ఈ క్ర‌మంలో ఓ న‌కిలీ బాబాని సంప్ర‌దించ‌గా.. ప్ర‌త్యేక పూజ‌లు చేయాల‌ని చెప్పాడు. అత‌ని మాట‌లు విని త‌న సొంత కూతురిపై తాంత్రిక పూజ‌లు చేశాడు. పూజ‌లు చేస్తున్న క్ర‌మంలో ఆ బాలిక ప‌సుపు, కుంకుమ‌ల‌తో కండ్లు మంట‌ల్లేసి అర‌వ‌డంతో చుట్టుప‌క్క‌ల వారు వ‌చ్చారు. ఆ బాలిక‌ను వెంట‌నే హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని నెల్లూరు జిల్లాలో జ‌రిగింది.

కుటుంబ సమస్యలు తీరేందుకు కన్నతండ్రి న‌కిలీ బాబా సలహా విని కూతురిని చంపుకున్నాడు. నెల్లూరు జిల్లా పేరారెడ్డిపల్లికి చెందిన వేణుగోపాల్ పొక్లెయిన్ బిజినెస్ చేసి నష్టపోయాడు. ఓ బాబా మాటలు విని కవల కూతుళ్లలో ఒకరైన పునర్విక (3)పై పూజలు చేశాడు. ఒంటిపై పసుపు నీళ్లు పోసి, నోటి నిండా కుంకుమ కుక్కాడు. పసుపు, కుంకుల‌తో ఊపిరాడక బాలిక కేకలు వేసింది. ఇది విన్న‌ స్థానికులు అక్క‌డికి వ‌చ్చి కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. ఆ బాలిక‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి ఇవ్వాల (మంగ‌ళ‌వారం) చనిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement