Sunday, April 28, 2024

ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ నాకే – లింగారెడ్డి

పొద్దుటూరు డిసెంబర్ 24 (ప్రభ న్యూస్):-ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి టికెట్ నాకేనా అని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని టిడిపి కడప పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది ప్రొద్దుటూరు ప్రజలకు ఏదో చేస్తామని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని చంద్రబాబు నాయుడు నమ్మకంతో ప్రొద్దుటూరు నియోజవర్గ బాధ్యతను తమకు అప్పగించారని అన్నారు. ఏదేమైనా ప్రొద్దుటూరు టిడిపి టికెట్ నాకే దక్కుతుందని స్పష్టం చేశారు.

పార్టీకి సంబంధం లేని వారు వచ్చి తమకే టికెట్ అని చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకోవడం సరికాదని ఎంతమంది వచ్చినా పార్టీ టికెట్ తమకే వస్తుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఆశించేవారు టిడిపికి ఏం మేలు చేశారని టికెట్ అడిగే అర్హత వారికి ఉందని ఆయన తెలిపారు .

టిడిపి ప్రభుత్వ నమ్ముకుని ఎంతో నష్టపోయామని అన్నారు..గత 30 సంవత్సరాలు నుంచి నేను టిడిపిలో పనిచేస్తున్నానని ఎవరికోసమో తన టికెట్ వదులుకుని త్యాగం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

పార్టీకి అన్ని విధాల అండగా ఉండి పార్టీ కష్టకాలం నుండి ముందుకు నడిపించాలని పార్టీలో ఉండి ఎంతో నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి యువసేన జిల్లా అధ్యక్షులు సిద్దయ్య, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement