Tuesday, May 7, 2024

శ్రీశైలంలో చిరుత పులి సంచారం

కర్నూలు జిల్లా శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్ర వద్ద భద్రతా సిబ్బందికి చిరుత కనిపించింది. రాత్రి ఒంటిగంట సమయంలో కుక్క పిల్లలను చిరుత చింపడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. దీంతో స్థానిక ప్రజలతో పాటు సెక్యూరిటీ సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు. 

కాగా, గతంలో శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో చిరుత పులి సంచరించింది. రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఓ అవును చిరుత పులి చంపేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement