Friday, April 26, 2024

టీడీపీ హ‌యాంలో 10.22శాతం వృద్ధి రేటు ఉండేది : య‌న‌మ‌ల

టీడీపీ హ‌యాంలో 10.22శాతం వృద్ధి రేటు ఉండేద‌ని, ఇప్పుడు జ‌గ‌న్ వ‌చ్చాక దాన్ని మైన‌స్ 2.58శాతం రివ‌ర్స్ చేశార‌ని మాజీ మంత్రి, టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… ఎఫ్ ఆర్ బీఎం ప‌రిమితుల‌ను ప‌రిమితుల‌ను ఉల్లంఘించార‌న్నారు. బ‌డ్జెట్ మాన్యువ‌ల్ ను కాల‌రాశార‌న్నారు. అందుకే ఫిస్క‌ల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాల‌ని తాము డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ పై గ్రీన్ పేప‌ర్ విడుద‌ల చేయాల‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement