Monday, May 6, 2024

అప్పులు తీర్చ‌లేక కౌలు రైతు ఆత్మహత్య.. కర్నూలు జిల్లాలో ఘటన

రుద్రవరం, (ప్రభ న్యూస్) : క‌ర్నూలు జిల్లాలో కౌలు రైతు సూసైడ్ చేసుకున్నాడు. రుద్ర‌వ‌రంమండ‌లంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బీరవోలు గ్రామానికి చెందిన కౌలు రైతు దాసరి భూషణం ( 35 ) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై నిరంజన్ రెడ్డి మంగళవారం తెలిపారు. భూషణం ఏడు ఎకరాల సాగు భూమి కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు. దీనికి దాదాపు 5 లక్షలకు పైగా అప్పుడు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులు తీర్చలేక గ్రామానికి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య సుజాత, ఇద్దరు చిన్న పిల్ల‌లున్నారు. కాగా, కౌలురైతు కుటుంబాన్ని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement