Thursday, May 16, 2024

KNL: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

కొత్తపల్లి (నంద్యాల జిల్లా) : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం, దుద్యాల గ్రామానికి చెందిన మిద్దె. వెంకటరమణ (58) అనే వ్యక్తి ఎనర్జీ ఎస్ లో ఇవాళ ఉపాధి కూలిగా పని చేసుకొనుచుండగా, గుండె పోటుతో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. దీంతో ఆయనతో పాటు పనిచేస్తున్న కూలీలు గమనించి ఆయనను వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈయన ఉపాధి కూలీ ద్వారానే కుటుంబాన్ని పోషించుకొనుచున్నాడు. ఈ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement